Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
View on original source
Category: Tourism
Share
Archive
Like
Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. Published Date :September 8, 2026 , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుండటంతో పాటు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ వాతావరణ పరిణామాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది. ముఖ్యంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం , పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. Police Recruitment: పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు.. ఎస్సై, కానిస్టేబుల్ జీతాల వివరాలు వెల్లడి.. Liquor Tenders: ఏపీలో మద్యం టెండర్లు.. ఎంఆర్పీ ధరలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. Airlines: కీలక పండుగల వేళ ఛార్జీలకు రెక్కలు.. భారీగా పెంచేసిన విమాన సంస్థలు ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన.. ఇప్పటికే మంగళవారం రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మిల్లీమీటర్లు, పెంటపాడులో 27.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, గుంటూరు జిల్లా పండ్రపాడు ప్రాంతాల్లో 24 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, వాహనదారులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు. వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.