యూపీ ఎన్నికల వేళ అఖిలేశ్‌ పార్టీలో ఖతర్నాక్‌ చేంజ్‌

యూపీ ఎన్నికల వేళ అఖిలేశ్‌ పార్టీలో ఖతర్నాక్‌ చేంజ్‌
View on original source
Category: Politics
Share
Archive
Like
లక్నో (ఉత్తరప్రదేశ్‌): సమాజ్‌వాదీ పార్టీ తన విద్యార్థి విభాగమైన సమాజ్‌వాదీ పార్టీ ఛాత్ర సభ దుస్తుల విధానాన్ని మార్చింది. ఇంతవరకు ఉన్న సంప్రదాయ ఎరుపు రంగుకు బదులుగా నీలిరంగు జీన్స్‌, నీలిరంగు టీషర్టులను కొత్త దుస్తులుగా నిర్ణయించింది. దళిత ఓటర్లు, యువతకు చేరువ కావాలనే ప్రయత్నంలో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది. 2027 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం లక్నోలో జరుగుతున్న ఛాత్ర సభ సదస్సులో కొత్త దుస్తుల విధానం కనిపించింది. పార్టీ పదాధికారులు, కార్యకర్తలు కొత్త నీలిరంగు దుస్తులతో హాజరయ్యారు. ఈ మార్పును కేవలం సంస్థాగత నిర్ణయంగా కాకుండా దళిత యువతలో పార్టీకి ఆదరణ పెంచే రాజకీయ వ్యూహంగా కూడా చూస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో రంగులకు సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రాధాన్యం ఉంది. నీలిరంగు దళిత రాజకీయాలు, బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతంతో ముడిపడి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ సంప్రదాయంగా ఎరుపు, ఆకుపచ్చ రంగులతో గుర్తింపు పొందింది. ఇది రాజకీయ సందేశం! ఈ నేపథ్యంలో విద్యార్థి విభాగానికి నీలిరంగును ప్రధాన రంగుగా మార్చడం రాజకీయ సందేశాన్ని ఇస్తున్న చర్యగా భావిస్తున్నారు. సమాజ్‌వాదీ పార్టీ తన సంప్రదాయ యాదవ్‌-ముస్లిం మద్దతు వర్గాలకు మించి దళిత ఓటర్లను చేరుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ ప్రతిపాదించిన పీడీఏ అంటే వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల సమీకరణ సూత్రానికి 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ రాజకీయ ప్రాధాన్యం లభించింది. రాబోయే ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో, యువ ఓటర్లను సమీకరించే ప్రయత్నాలు సాగుతున్న వేళ ఈ దుస్తుల మార్పు సమయానికి కూడా రాజకీయ ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు 2027లో జరగనున్నాయి. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్య పోటీ ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో 403 మంది ఎన్నికైన సభ్యులు ఉన్నారు. వీరిలో 258 మంది భారతీయ జనతా పార్టీకి, 107 మంది సమాజ్‌వాదీ పార్టీకి, 13 మంది అప్నా దళ్‌కు చెందినవారు. సమాజ్‌వాదీ పార్టీతో పొత్తులో ఉన్న కాంగ్రెస్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. 2027 ఎన్నికల్లో విజయం సాధించడంపై దృష్టి పెట్టింది.

(0)Comments

 

A note on cookies

Newshunt uses essential cookies to keep you signed in and to remember your language and country, so the site works the way you expect. With your permission, we'd also like to use analytics cookies to understand how people use Newshunt and improve it over time.

Accepting only affects analytics. To learn more, view our Privacy Policy or Terms & Conditions.